చంద్రబాబు కృషితో ఉక్కుకు ఆర్థిక భరోసా - (కావలి యం.ఎల్.ఏ, దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి)
ఉత్తరాంధ్రకే గాక యావత్త్ ఆంధ్రరాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారం. వేలాది మంది తెలుగోళ్ళు కలిసి విరోచిత పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవింపజేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుంది. గౌ.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హస్తీన పర్యటనకు వెళ్ళి వచ్చిన ప్రతీసారి ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్తునే ఉంది. నేడు ఆర్థిక సంక్షోభంలో పూడుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు రూ.11,440 కోట్లు ఆర్థిక ప్యాకేజీని ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినేట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలి, ఉక్కు ఆస్తులను అమ్ముకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తే విశాఖ ఉక్కును ఏ విధంగా పరిరక్షించాలని చంద్రబాబు నాయుడు గారు ఆహర్నిశలు శ్రమిస్తున్నారు. ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తికి సామర్ధ్యమున్న విశాఖ స్టీల్ ప్లాంట్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అప్పుల్లో కూరుకుపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎమర్జెన్సీ అడ్వాన్స్ ఫండ్ కింద జీఎస్టీ చెల్లింపులకు రూ.500 కోట్లు, ముడిసరుకు సంబంధించి బ్యాంకు అప్పుల చెల్లింపులకు రూ.1,150 కోట్లు చొప్పున మొత్తం రూ.1,650 కోట్లను రెండు విడతల్లో కేంద్రం ఆర్థిక సాయం అందించింది. నేడు స్టీల్ ప్లాంట్ను సంక్షోభం నుంచి ఆదుకునేందుకు చంద్రబాబు గారి కృషికి ఫలితంగా రూ.11,440 కోట్లు సాయాన్ని కేంద్ర ప్రకటించడం అభినందనీయం.
1994లో నష్టాల పేరుతో బీఐఎస్ఆర్ ప్రమాదం ఏర్పడితే. దాన్ని అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి పునర్వ్యవస్థీకరణ జరపకుండా.. ప్లాంట్లను అమ్మడానికి ప్రయత్నించింది. అందుకు ఎర్రన్నాయుడు గారి నేతృత్వంలో టీడీపీ ఎంపీలు పోరాటంతో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 1998లో నాటి ప్రధాని వాజ్పేయ్ గారితో మాట్లాడి రూ.1,650 కోట్లు తీసుకువచ్చి విశాఖ ఉక్కును పరిరక్షించారు. కేంద్ర ప్రభుత్వమిచ్చిన రుణాన్ని ఈక్విటీగా మార్చాలని, రుణంపై వడ్డీని మాఫీ చేసి బీఐఎస్ఆర్కు వెళ్ళకుండా తప్పించాలని టీడీపీ ఎంపీలు కోరడంతో నాటి ఉక్కు శాఖ మంత్రి నవీన్ పట్నాయక్ రూ.1,333 కోట్ల రుణాన్ని ఈక్వీటీగా మార్చడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ సమగ్రాభివృద్ధి కోసం కన్సల్టెంట్ను కూడా ఏర్పాటు చేశారు. ఉక్కు కర్మాగారానికి రికార్డు స్థాయిలో లాభాలు వచ్చేలా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేయడం జరిగిందని 2002లో అప్పటి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనడం జరిగింది.
అప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది... నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో నుంచి స్టీల్ ప్లాంట్ను గట్టెక్కించింది చంద్రబాబు గారే.... తప్పుడు కూతలతో వైసీపీ ఎంత దుష్ప్రచారం చేసినా వారి మాటలను వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని నేను తెలియజేస్తున్నాను.
ఇట్లు
దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
(కావలి నియోజకవర్గ శాసనసభ్యులు).