పోలేరమ్మ తల్లి గ్రామ పొంగళ్లు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే..

 పోలేరమ్మ తల్లి గ్రామ పొంగళ్లు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే..

కావలి రూరల్ మండలం తాళ్లపాలెం పంచాయతీ లింగంగుంట గ్రామంలో  వెలసి ఉన్న గ్రామదేవత శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ తల్లి  గ్రామపొంగళ్ల కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు..ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికిన పోలేరమ్మ తల్లి కమిటీ సభ్యులు,టిడిపి నాయకులు గ్రామస్తులు.. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు,అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు..ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు కావలి నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానన్నారు.

కావలి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని,కావలి నియోజకవర్గంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా కాపు కాస్తానని తెలిపారు.లింగంగుంట ప్రజలు చూపుతున్న అభిమానం ఎనలేనిదని తెలిపారు..ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

google+

linkedin