ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి,కలెక్టర్ ఆనంద్ ని కలిసి వినతిపత్రం ఇచ్చిన జబర్దస్త్ నటుడు శాంతి స్వరూప్..
కావలి పట్టణంలో సిసి రోడ్లు శంకుస్థాపనకు వచ్చిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ను శనివారం పట్టణంలోని జడ్పీ హైస్కూల్ గ్రౌండ్లో జబర్దస్త్ నటుడు శాంతి స్వరూప్ కలిసి వినతి పత్రం అందజేశారు. శాంతి స్వరూప్ సొంత నియోజకవర్గం కావలి కావడంతో కావలి ప్రజలకు నటన నేర్పించేందుకు నటన శాల నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి స్థలం కేటాయించాలని కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
ని కోరారు. పరిశీలించి స్థానానికి కేటాయిస్తానని శాంతి స్వరూప్ కు కలెక్టర్ హామీ ఇచ్చారు.