షటిల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే

షటిల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే 

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా కావలి పట్టణంలోని జవహార్ భారతి కాలేజీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన షటిల్ టోర్నమెంట్ ను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. క్రీడలను ప్రారంభించిన ఆయన సరదాగా కాసేపు షటిల్ ఆడారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వం తో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు.  గెలిచినప్పుడు ఒదిగి ఉండాలని, ఓడినప్పుడు కృంగిపోకుండా తిరిగి విజయం కోసం ప్రయత్నించాలని క్రీడాకారులకు తెలిపారు.. ప్రతి ఒక్కరూ తమ ఒత్తిడిని తగ్గించుకోవడానికి కాసేపు ఆటలు ఆడాలని తెలిపారు. చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా షటిల్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు.

google+

linkedin