హైదరాబాద్ కు చెందిన భారతి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 4,218 చిన్నారులు ప్రదర్శించిన అతి పెద్ద కూచిపూడి నాట్యానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు

హైదరాబాద్ కు చెందిన భారతి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 4,218 చిన్నారులు ప్రదర్శించిన అతి పెద్ద కూచిపూడి నాట్యానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు లభించడంతో అందులో భాగస్వాములు అయిన కావలి కి చెందిన శ్రీ మేధ నృత్య కళా నిలయం చిన్నారులు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారిని ఆదివారం వారి కార్యాలయంలో కలిశారు.. వారు సాధించిన మెడల్స్, సర్టిఫికెట్లను ఆయన చూసి హర్షం వ్యక్తం చేశారు. మునుముందు కూడా కావలికి పేరు ప్రఖ్యాతలు  తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు టిడిపి నాయకులు జ్వాలా చంద్ర, నాట్య గురువులు, చిన్నారుల తల్లిదండ్రులు, చిన్నారులు పాల్గొన్నారు..

google+

linkedin