అమర వేదగిరి టీడీపీ లో చేరిక

 అమర వేదగిరి టీడీపీ లో చేరిక

కావలి అభివృద్దే నా ధ్యేయం, పరిశ్రమల రాకతో యువతకు భారీగా ఉద్యోగాలు, జూన్ 3న సంవత్సర పాలన లో జరిగిన వాటిని వివరిస్తాను -కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వెల్లడి

కావలి పట్టణ 33వ వార్డు అధ్యక్షులు జ్వాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు అమర వేదగిరి సుబ్బారాయుడు గుప్తా ఆదివారం రాత్రి తెలుగుదేశం పార్టీ లోచేరారు. కావలి పట్టణం ఏఎన్ఆర్ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆయన కు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్డు నాయకులు, తెలుగుదేశం కార్యకర్తల కష్ట ఫలితంతో 553 ఓట్ల మెజారిటీ ఈ వార్డులో రావడం జరిగిందన్నారు. నా మీద నమ్మకంతో, ఈ కావలికి సేవ చేస్తాను అన్నటువంటి నమ్మకంతో నాకు మెజారిటీ ఇచ్చినందుకు ఈ వార్డు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. కావలి తెలుగుదేశానికి కురువృద్ధులు సుబ్రహ్మణ్యం అని, ఆయన సతీమణి కౌన్సిలర్ గా, ఆయన కౌన్సిలర్ గా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా ఉన్నారన్నారు.

చంద్రబాబు నాయుడు ఆయన ఇంటి ముందుకు వచ్చి, సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేశారు అంటే ఆయన యొక్క నిబద్ధత, ఆయన క్రమశిక్షణ అంత గొప్పదన్నారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయంలో మేము కూడా అడుగు పెట్టామని అన్నారు. వేదగిరి చాలా కాలం నుంచి నాకు ఒక మంచి మిత్రుడు అని, ఎక్కడ కనిపించినా ఆత్మీయంగా, మనసారా పలకరించే వ్యక్తి అని అన్నారు. కావలి కనకపట్నం దిశగా అడుగులు వేస్తుందని, కావలిని అనుసంధానం చేసుకుని కొన్ని వందల కంపెనీలు కావలికి వస్తున్నాయని, దీనికి ముఖ్య కారణం జవహర్ భారతి కళాశాలను ఏర్పరిచి కొన్ని లక్షల మందికి జీవితాన్ని ఇచ్చిన దొడ్ల రామచంద్ర రెడ్డి ఒకరని,  వ్యాపారాలు ప్రారంభించి అనేకమంది కి ఉపాధి కల్పిస్తున్న వైస్యులు ఇంకొకరిని తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు దయవల్ల మన కావలి లో ఎయిర్పోర్ట్ వస్తుందని, దగ్గరలో రామాయపట్నం పోర్ట్ వచ్చిందని, ఈరోజున బిపిసిఎల్ కంపెనీ వస్తుందన్నారు. రామాయపట్నం పక్కన ఇండో సోలార్ కంపెనీ 24వేల కోట్లతో రాబోతుందన్నారు. 8.5 కిలోమీటర్ల పొడవున్న ఈ కావలి ట్రంక్ రోడ్డు వ్యాపారపరంగా విస్తరిస్తే మొట్టమొదట లబ్ది చేకూరేది మన కావలి వైశ్య వ్యాపారస్తులకే అని అన్నారు. యువతకు భారీగా ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆరు సంవత్సరాలుగా మున్సిపాలిటీ ఎన్నికలు జరగక కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు ఆగిపోయాయన్నారు. త్వరలోనే కావలి మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్నాయని తెలిపారు. కావలిని అభివృద్ధి చేయాలని తపన ఉన్నటువంటి వారినందరిని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోవాలి, వారి సలహాలు కూడా ఈ కావలి అభివృద్ధి కోసం తీసుకోవాలని నిర్ణయించడం జరిగిందన్నారు. 

గతంలో యాదగిరి ఈ కావలిలో కౌన్సిలర్ గా పనిచేసినటువంటి అపారమైన అనుభవం ఉందని,  అధికారులతో మాట్లాడేటువంటి చనువు ఉందని, పేదవాళ్ళకు పని చేయాలనే తపన ఉందని,  అందుకే మాతో నడవగలిగితే మేము చేసేటువంటి యజ్ఞానికి ఆయన శక్తి కూడా తయారైతే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. నా వ్యాపారాలను వదిలి నేను ఒక సేవకుడిగా సేవ చేయాలని వచ్చానన్నారు. జూన్ 3వ తేదీన కావలి లో సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి ని వివరిస్తాను. గత ఐదు సంవత్సరాలలో జరిగిన విధ్వంసాన్ని తెలపబోతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

google+

linkedin