కలుగోల శాంభవి అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాను - ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి
కావలి ప్రజలు గ్రామదేవతగా కొలుచుకునే శ్రీ కలుగోల శాంభవి అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఆలయ అధికారులు, నాయకులతో కలిసి కలుగోల శాంభవి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి శాలువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయ ప్రాంగాన్ని పరిశీలించి, అధికారులతో స్థానిక నాయకులతో చర్చించారు. కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న విధంగానే కలుగోల శాంభవి అమ్మవారి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.