జిల్లా మహానాడు ఏర్పాట్ల పరిశీలన
ఈనెల 23న తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు మహానాడు కార్యక్రమాన్ని నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి గారు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, ముఖ్య నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు తదితరులు ఏర్పాట్లపై సుధీర్ఘంగా చర్చించారు.
కన్వెన్షన్ సెంటర్ ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాటు చేయాల్సిన వసతులపై సమీక్షించారు. సదుపాయాలపై పటిష్ట చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే జిల్లా మహానాడులో తీర్మానించాల్సిన అంశాలపై వారు చర్చించారు.