ఆంధ్ర కిచెన్స్ ను ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే
ముసునూరు టోల్ గేట్ సమీపంలో నూతన యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంధ్ర కిచెన్స్ హోటల్ ను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు సోమవారం ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. హోటల్ కు విచ్చేసిన ఎమ్మెల్యేను హోటల్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు. వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని, నాణ్యత తో కూడిన ఆహారం ఆహార ప్రియులకు అందించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..