ఖాదర్ బాషా కు ఘన నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు

ఖాదర్ బాషా కు ఘన నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు

తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ నాయకులు,  తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఖాదర్ బాషా (ఇట్టు) సోమవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి సూచనల మేరకు మంగళవారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఖాదర్ బాషా చిత్రపటం ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు. ముస్లిం ల అభ్యున్నతికి, పార్టీ కి ఖాదర్ బాషా చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఒక గొప్ప నాయకుడిని తెలుగుదేశం పార్టీ కోల్పోవడం జరిగిందని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం తెలియజేసారు. అనంతరం కావలి పట్టణంలోని ఇస్లాం పేటలోని ఖాదర్ బాషా ఇంటి వద్ద నుండి ప్రారంభమైన అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, దావులూరి దేవకుమార్, శానం హరి, బొట్లగుంట శ్రీహరి నాయుడు, కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం, రఫి, కిరణ్, రహీం, మస్తాన్, నారాయణ, ఆత్మకూరు నాగలక్ష్మి, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, ముస్లిం నేతలు పాల్గొన్నారు..

google+

linkedin