సీతా రాముల కళ్యాణంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
కావలి రూరల్ మండలం చెంచుగాని పాలెం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవం లో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు,గ్రామస్తులు అనంతరం స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వార్ల ఆశీస్సులు తీసుకున్నారు. స్వామి వారి కళ్యాణాన్ని తిలకించి కావలి నియోజకవర్గంలో ప్రజలు సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నారు.రాముని గొప్పతనం గురించి ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు..