పోలేరమ్మ తల్లి పొంగళ్ళ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామంలో జరిగిన పోలేరమ్మ తల్లి గ్రామ పొంగళ్ల కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు మంగళవారం పాల్గొన్నారు.. గ్రామస్తుల ఆహ్వానం మేరకు పలువురు ఇళ్లకు వెళ్లి మాటామంతి కలిపారు. దాదాపు డెబ్భై ఏళ్ల క్రితం తిరునాళ్ళు జరిగాయని, పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో మరలా ఇప్పుడు జరుగుతున్నాయని తెలిపారు.. పోలేరమ్మ తల్లి తిరునాళ్ళను ప్రతి సంవత్సరం పండుగ వాతావరణలో ప్రశాంతంగా చేసుకుంటూ అమ్మ ఆశీస్సులు పొందుతూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు...