ప్రమీలమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన కావలి ఎమ్మెల్యే
కావలి పట్టణం బృందావనం కు చెందిన వేమూరి పెద్దులు సతీమణి వేమూరి ప్రమీలమ్మ గారు ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు శుక్రవారం వారి నివాసానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి, కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్, తదితరులు పాల్గొన్నారు..