41మంది కి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణి చేసిన.కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..
వివిధ వ్యాధులపై చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నెల్లూరు జిల్లా,కావలి నియోజకవర్గం లోని 758 మంది కి ఇప్పటి వరకు రూ. 6,58,26,582 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చెప్పారు.మంగళవారం స్థానిక టిడిపి కార్యాలయంలో 41 మంది లబ్ధిదారులకు రూ. 27,28,936 చెక్కులు అందజేశారు.రాష్ట్రంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో కావలి ప్రథమన్నారు. వైద్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారు. మొత్తం 1078 అప్లికేషన్లు వచ్చాయని వాటిలో ఇప్పటివరకు 758 మందికి ఇచ్చామన్నారు. మిగిలిన వారికి కూడా త్వరలోనే అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి కావలి నియోజకవర్గం ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అభివృద్ధి ని పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు కంటే ఎక్కువ పధకాలు ఇస్తున్నారన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో జిల్లాలోనే ప్రథమ స్థానం లో ఉందన్నారు.











