జూనియర్ సివిల్ జడ్జి గా నియమితులైన సత్య ధనుషా ను సత్కరించిన ఎమ్మెల్యే
కావలి పట్టణం బృందావనం హౌసింగ్ కాలనీకి చెందిన దరిశి వెంకట సత్య ధనుషా ఏపీ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన సందర్భంగా సోమవారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన విశిష్ట సాధనతో కావలి కి గర్వకారణంగా నిలిచిన దరిశి వెంకట సత్య ధనుషాను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు.