సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం - కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

 సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం

- రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని మార్చేసిన యువనేత లోకేష్

- కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి 

సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం అయిందని, వరల్డ్ ఎకనామిక్ ఫారం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి నిర్వాకానికి అంధకారంలోకి వెళ్ళిన పారిశ్రామిక రంగానికి నూతన వెలుగులు తీసుకురావడం కోసం చంద్రబాబు, లోకేష్ రేయింబవళ్ళు కష్టపడుతున్నారన్నారు. నాడు తెలుగు ప్రజలకు మొదటిసారి ఐటీని పరిచయం చేసి తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారని, నేడు మరో ఇన్నొవేషన్ కు చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. ఏఐ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచ దిగ్గజాలతో భేటీ చంద్రబాబు అయ్యారని అన్నారు. అన్ని రాష్ట్రాల ప్రతినిధులు తమ రాష్ట్ర శ్రేయస్సుకై పోటీ పడ్డారు. కానీ చంద్రబాబు మాత్రం రాష్ట్రం కోసమే కాకుండా యావత్ దేశం తరపునే దావోస్ లో నాయకత్వం వహించారన్నారు. ప్రపంచంలోనే అత్యంత తలసరి ఆదాయం గల దేశాల్లో మన దేశాన్ని అగ్రగామిగా నిలపాలని పిలుపునివ్వడంతో పాటు తెలుగువాడి ప్రతిభను మరోసారి పరిచయం చేసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంగా ఎముకులను కొరికే చలిని సైతం లెక్కచేయకుండా రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం తీసుకురావడానికి దావోస్ నడి వీధుల్లో సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ పడిన శ్రమ సత్ఫలితాలనిస్తున్నాయన్నారు. వెళ్ళిన ప్రతి చోట రెడ్ కార్పెట్ వేసి చంద్రబాబు, లోకేష్ లకు పారిశ్రామికవేత్తలు స్వాగతం పలికారన్నారు. రాష్ట్రంలో ఉన్న అపార వనరులు, మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ పాలసీల గురించి పారిశ్రామికవేత్తలకు వివరించి పెట్టుబడులు పెట్టేందుకు అంధ్రప్రదేశ్ అనువైన రాష్ట్రమని ఆహ్వానించడం జరిగిందన్నారు. భేటీ అయిన ప్రతీ పారిశ్రామికవేత్త తమ ఎగ్జిక్యూటివ్ మెంబర్లతో చర్చించి తప్పకుండా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతామని సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, టాటా చైర్మన్ చంద్రశేఖరన్ వంటి ప్రపంచ దిగ్గజాలు సీఎం చంద్రబాబు విజన్ ను మెచ్చుకోవడం, రాష్ట్రంలో పెట్టుబడి పెడతానని హామీ ఇవ్వడం చంద్రబాబు విజన్ 2047 విజయాన్ని సూచిస్తోందన్నారు. చంద్రబాబు విజన్ కు మెచ్చి, అమలు చేస్తున్న పాలసీలకు ఆకర్షితులై అనేక దేశ విదేశి కంపెనీలు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు నేడు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నారన్నారు. ఐదేళ్లల్లో జగన్ రెడ్డి తీసుకురాలేనన్ని పెట్టుబడులు ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లోనే మనం సాధించామని, చంద్రబాబు పాలనలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు ఆంధ్రప్రదేశ్ స్వర్గదామిగా మారిందన్నారు. కమిషన్ల కోసం కకృత్తిపడి చంద్రబాబు కృషితో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు, స్టార్టప్ కంపెనీలను, లక్షల కోట్ల పెట్టుబడులను జగన్ రెడ్డి తరిమేశాడన్నారు. 

జే ట్యాక్స్ పారిశ్రామికవేత్తలను బెంబేలెత్తించి పారిశ్రామికాభివృద్ధిని గాలికి వదిలేశాడన్నారు. కేసుల నుంచి విముక్తి పొందేందుకు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టేందుకు, విశాఖ ఉక్కును అమ్మేందుకు జగన్ రెడ్డి ప్రయత్నించాడన్నారు. కానీ గాడితప్పిన అన్ని రంగాలను చంద్రబాబు తిరిగి గాడిలో పెట్టారన్నారు. 2014లో విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడేందుకు విశాఖలో 3 సార్లు పెట్టుబడుల సదస్సును నిర్వహించి, దావోస్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో పర్యటించి అన్ని రంగాల్లో కలిపి రూ.11.77 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి ఏపీని బ్రాండ్ ఏపీగా తీర్చి దిద్దడం జరిగిందన్నారు. 2019లో వైసీపీ వచ్చాక 'బ్రాండ్ ఏపీ'గా ఉన్న మన రాష్ట్రాన్ని 'బిల్డప్ ఏపీ'గా జగన్ రెడ్డి మారిస్తే తిరిగి సన్ రైజ్ ఏపీగా నేడు చంద్రబాబు మార్చారన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులుతో సుమారు 50 కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. ఇప్పటికే అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు మొదలుపెట్టాయని, యువతకు 40 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించాయని తెలిపారు. ఒక్క జూమ్ కాల్ తోనే ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ కంపెనీతో మాట్లాడి రాష్ట్రానికి 1.46 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చిన ఘనత నారా లోకేష్ దన్నారు. జనవరి 8న విశాఖలో రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోది శంకుస్థాపన చేశారన్నారు. టీసీఎస్, బీపీసీఎల్, రిలైన్స్, గ్రీనోకో, ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్, పీపుల్ టెక్ వంటి ఎన్నో పరిశ్రమలు ఇప్పటికే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతున్నాయన్నారు. యువగళం పాదయాత్ర చేపట్టి యువనేత లోకేష్ రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని  మార్చేసారని అన్నారు.



google+

linkedin