పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 30-05-2025
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముసునూరు కు చెందిన మర్లపాటి శ్రీను - రాజేశ్వరి దంపతుల కుమారుడు సాయి వివాహం ముసునూరులోని వారి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కావలి పట్టణం 32వ వార్డుకు చెందిన పల్లపు ప్రసాద్ కుమార్తె వీర రాఘవి ఓణి ల మహోత్సవ కార్యక్రమం కావలి పట్టణంలోని దొడ్ల మనోహర్ రెడ్డి కల్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. కావలి పట్టణం కచ్చేరిమిట్టకు చెందిన ఆకుల సువార్తమ్మ ప్రథమ జ్ఞాపకార్ధ స్తుతి కూడిక వారి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, రూరల్ మండల నాయకులు నాయుడు రాంప్రసాద్, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..