ప్రజా ప్రతినిధులతో కలసి మహానాడు తరలి వెళ్లిన కావలి ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీ ప్రతిష్మాత్మకంగా చేపట్టిన మహానాడు కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారి ఆదేశాలతో రెండవ రోజు కావలి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు,టిడిపి శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు వివిధ వాహనాల్లో కడపకు తరలి వెళ్లారు..టిడిపి శ్రేణులతో కలిసి కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు..మహానాడు ప్రాంగణం వద్ద టిడిపి నాయకులు కార్యకర్తలుతో సెల్ఫీలు దిగారు..సహచర ఎమ్మెల్యేలు, మంత్రులతో సందడి చేశారు...
ఎమ్మెల్యే మాట్లాడుతూ కడపలో జరిగిన మహానాడు కార్యక్రమంలో సహచర టీడీపీ ఎమ్మెల్యేలు,మంత్రులు కావలి నియోజకవర్గ టీడీపీ నాయకులు,కార్యకర్తలు అభిమానులతో కలిసి పాల్గొనడం చాలా సంతోష ఉందని.దేవుని గడప కడపలో జరిగిన ఈ మహానాడుకు
రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతి గడప నుంచి టిడిపి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.మహానాడు వేదిక ప్రవేశపెట్టిన తీర్మానాలు ఆమోదించిన తీర్మానాలు భవిష్యత్తు తరాలకు బంగారు భవితనిస్తాయని నేను విశ్వసిస్తున్నాను...