భారత స్వాతంత్రోద్యమం ఆంధ్ర ముస్లిం యోధులు పుస్తకాన్ని ఆవిష్కరించిన కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..
పుస్తక రచయిత సయ్యద్ నసీం అహ్మద్ ను సన్మానించిన ఎమ్మెల్యే
నెల్లూరు జిల్లా.. కావలి పట్టణం ఇండియన్ రెడ్ క్రాస్ భవనంలో భారత స్వాతంత్రద్యమం-ఆంధ్ర ముస్లిం యోధులు పుస్తకావిష్కరణోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యులు శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆదివారం హాజరయ్యారు... ఈ సందర్బంగా ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించారు..అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరు గుర్తు చేసుకొని వారి ఆచరణాలలో కొనసాగించాలన్నారు.. ప్రతి ఒక్కరూ కుల మతాలు భేదభిప్రాయాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలని ఇలాంటి పుస్తకాలను రసించడం ఎంతో శుభ పరిణామం అన్నారు..ప్రజల్లో చైతన్య తీసుకువచ్చేలా ఇంకా ఇలాంటి మంచి పుస్తకాలను రాసి ప్రజలకు అందించాలని ఆయన కోరారు..
ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత శ్రీ సయ్యద్ నసీర్ అహమ్మద్,టిడిపి నాయకులు, గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, తిరువీధి ప్రసాద్,సభాదక్షులు అన్నదాత మణి,, పుస్తకపరిచయకర్త ఈత కోట సుబ్బారావు, సీనియర్ ప్రముఖ రచయిత నెల్లూరు,, విశ్రాంత ప్రధానోపాధ్యా యులు శ్రీమతి సి. శారద, IMA గౌరవ అధ్యక్షులు, బెజవాడ రవికుమార్, p. జాఫర్ ఖాన్,Rtd HM, sk. బాషా, విశ్రాంత వసతిగృహ సంక్షేమాధికారి, డాకారపురవిప్రకాష్ మొఘల్ సలీం బేగ్,సబ్దర్ కిర్మాణి,కరిముల్లా,తదితరులు పాల్గొన్నారు..